ఒంగోలు, శ్రీకాకుళం, నెల్లూరు, కడప ప్రభుత్వ ఆసుపత్రిలలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. తాడేపల్లిలో సీఎం క్యాంపు ఆఫీస్ నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. భవిష్యత్ లో మరో ఏడుచోట్ల వైద్య పరీక్షల పరికరాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కోవిడ్ వేళ తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బందికి అభినందనలను తెలిపారు.