కిశోర్ ఇందుకూరి .... ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్, అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్, పీహెచ్డీ, ఇంటెల్లో లక్షల్లో సంపాదన. ప్రపంచ స్థాయి పేరున్న కంపెనీలో కొలువు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ అతడికి సంతృప్తి లేదు. ఏదో సాదించాలనే తపన... దాంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఒకసారి పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు స్వచ్ఛమైన పాలు దొరక్క హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించాడు. ఆ సమయంలో కిశోర్కి ఓ ఆలోచన వచ్చింది. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి 20 ఆవులు కొని సొంత డెయిరీ ప్రారంభించాడు. డెయిరీకి తన కుమారుడు సిద్దార్థ్ పేరు మీద “సిద్ ఫార్మ్” అని పేరు పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2018 నాటికి డెయిరీ విస్తరింపజేశాడు.
ప్రస్తుతం అతడు 6 వేల మందికి పాలు పోస్తున్నాడు. షాబాద్లో విస్తరించిన తన ఫామ్లో ప్రస్తుతం 120 మందికి పని కల్పించాడు. కేవలం పాలు మాత్రమే కాక సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తున్నాడు. సిద్ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు పాల ఉత్పత్తులను అందిస్తుంది. ఈ డెయిరీ మీద కిశోర్ సంవత్సరానికి 44 కోట్లు ఆర్జిస్తున్నాడు.