తొలి దశ అధ్యయనం పూర్తి !
May 26, 2021
0
కరోనాకు విరుగుడుగా ఆనందయ్య తయారు చేసిన మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) తొలి దశ అధ్యయనం పూర్తి అయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం చేశాయి. రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు పూర్తి చేశారు. ఈ పరిశోధనల నివేదికను ఆన్లైన్లో సీసీఆర్ఏఎస్కు అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంబించనున్నారు. టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.