వైద్యో నారాయణ హరి (వైద్యుడు దేవునితో సమానం) అని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఈ కరోనా సమయంలో దేవుని కన్నా మిన్నగా వైద్యులు సేవలు చేశారు.
కరోనా కాటుకు గతేడాది దేశవ్యాప్తంగా 730 మంది బలయ్యారు. ఈ సంత్సరం ఇప్పటి వరకు 244 మంది మరణించినట్లు భారత వైద్య సంఘం (ఐఎంఏ) వెల్లడించింది. 25 ఏళ్ల నుంచి 87 ఏళ్ల వయస్సు గల వైద్యులు, అత్యధికంగా బీహార్ లో 69 మంది, ఉత్తరప్రదేశ్ లో 34 మంది, ఢిల్లీ లో 27 మంది, ఆంద్రప్రదేశ్ లో 21 మంది చొప్పున సెకండ్ వేవ్ లో మరణించినట్లు భారత వైద్య సంఘం తెలియజేసింది.