కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా మానవాళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో మహమ్మారిపై పోరాడుతున్న భారత్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ ఎం ఎఫ్ ) సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఈ సంస్థ ప్రతినిధి జెర్రీ రైస్ అన్నారు. భారత్ లో టీకా ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు, ఆరోగ్య రంగానికి ఆర్ధిక వనరులు అందించడం చాలా ముఖ్యం. కరోనాను ఎదుర్కొనేందు కావలసిన సాంకేతిక అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా సహాయ కార్యాక్రమాలను రెట్టింపు చేస్తామని అయన అన్నారు. ఈ సమయంలో ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలవడం శుభ పరిణామమన్నారు.
Post a Comment
0Comments
3/related/default