ఫస్ట్ వేవ్ లో ప్రతిది శానిటైజ్ చేస్తే గాని తాకేవారముకాదు. ప్రతి వస్తువుల ఉపరితలంపై వైరస్ వుంటుందని శాస్త్రవేత్తలు చెప్పడం వలన ;పండ్లు, కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగేవారం, ప్రతి వస్తువును శానిటైజ్ చేసిన తరువాత తాకేవారం.
వస్తువుల ఉపరితలం మీద ఉనికి అంతంతమాత్రమేనని, వాటిని తాకడం వలన కరోనా సోకే ముప్పు 0.01శాతమేనని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలియజేసింది. ప్రమాదకర కెమికల్స్ వాడుతున్నారని వాటిని వాడకూడదని సీడీసీ తెలిపింది.
కరోనా సోకిన వారి నోరు, ముక్కు ద్వారా వెలువడే వైరస్ తో కూడిన బిందువుల వలన ఇతరులకు కరోనా సోకిన ప్రమాదం ఉంటుందని సీడీసీ తెలిపింది. అందువలన అందరూ భౌతిక దూరం పాటించాలి. సరైన పధ్దతిలో మాస్క్ లను విధిగా ధరించాలి.