చేతబడి పేరుతో......!

Telugu Lo Computer
0

 


సభ్య సమాజం తల దించుకొనే  ఘటన  నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని చర్లగూడెంలో జరిగింది. కంప్యూటర్ యుగంలో కూడా చేతబడులపై ప్రజలకు ఎంత పిచ్చి ఉందో! ఆ  పేరుమీద జనాలను ఏవిధంగా హింసిస్తున్నారో ఈ ఘటన చూస్తే అర్ధమౌతుంది. చర్లగూడెం గ్రామానికి చెందిన అంజయ్య, వెంకటయ్య అనే వారు చేతబడి చేస్తున్నట్లు మమత అనే మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో దాదాపు 10 మంది వారిని గ్రామములో ఒక చెట్టుకు కట్టి చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వచ్చి ఆ ఇద్దరినీ విడిపించి, దాడిచేసిన 10 మందిపై కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)