మాస్క్ లు ధరించాల్సిందే!

Telugu Lo Computer
0

టీకా రెండు డోసులు తీసుకున్నవారు కూడా డబుల్ మాస్క్ లు ధరించాల్సిందేనని ఎయిమ్స్ డెరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్ వేరియంట్లను ప్రసుత్తం అందుబాటులో ఉన్న టీకాలు ఏ మేరకు కట్టడి చేస్తాయో అనే దానిపై ఇంకా సందేహాలు వెలువడుతూనే ఉన్నాయి. అందువలన రెండు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్ లు  ధరించడం తప్పనిసరి. 
అమెరికాలో టీకా తీసుకున్నవారు ఇకమీదట మాస్కలు ధరించనవసరం లేదని ఆ దేశ వ్యాధి నియంత్రణ,  నిర్ములనా కేంద్రం వారు (సీడీసీ) ప్రకటించింది. రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చునని సిడిసి తన మార్గదర్శకాలలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత దేశములో రెండు డోసులు తీసుకున్నవారు మాస్క్ లు  ధరించాలా, లేదా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో  ఎయిమ్స్ డెరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ సూచనలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)