కరోనా రోగులకు అందించే ప్లాస్మా థెరపీని చికిత్సల జాబితా నుండి తొలగించింది. కొత్త మార్గదర్శికాలలో రెమ్ డేసివిర్, టోసిలిజుమ్యాబ్ లను మాత్రమే వినియోగించటానికి అనుమతించింది. ప్లాస్మా థెరపీ వలన ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాలలో తేలడంతో కోవిద్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్, జాయింట్ మోనిటరింగ్ గ్రూప్ లో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఐసీఎంఆర్ సవరించిన మార్గదర్శికాలను విడుదల చేసింది.