టీకా - కేంద్రం నూతన మార్గదర్శికాలు

Telugu Lo Computer
0

 

కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 

* తొలి డోసు తర్వాత కరోనా వస్తే మూడు నెలలకు రెండో డోసు వేయించుకోవాలని సూచించింది.

* తీవ్రంగా జబ్బుపడి కోలుకున్న వారికి 4-8 వారాల తర్వాతే టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. 

* వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత, ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ వచ్చిన రెండు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చంది. 

*వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా నిర్థరణ అక్కర్లేదన్నది. 

* బాలింతలందరికీ  టీకాలు వేయాలని నిపుణుల ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. 

* ప్లాస్మా చికిత్స పొందిన వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తరువాత టీకా వేయించుకోవాలి. 

కోవిడ్ నుండి కోలుకున్న మూడు నెలల తరువాత టీకా తీసుకోవాలి.  అంతకు ముందు ఇది 4-8 వారాలు వుండేది. 

Post a Comment

0Comments

Post a Comment (0)