కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్య వయస్కులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. మరణాలకు కరోనా తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణ మౌతున్నాయా? లేదా ఏదైనా వైరస్ ప్రాణాంతకముగా మారిందా? అనే దానిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనం చేయబోతుంది. రీ ఇన్ఫెక్షన్, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్, మరణాలకు దారితీస్తున్న రకాలపై పరిశోధించనున్నది. మహమ్మారితో చనిపోయిన నుంచి నమూనాలు సేకరించి వాటి జన్యు క్రమాలను విశ్లేషించనున్నారు.