ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషధ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని, టిటిడి పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. మందులో ఎటువంటి దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యులు చేబుతున్నారని, ఆయూష్, ఐసీఎంఆర్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. శేషాచలం అడవుల్లో వనమూలికలు ఉన్నాయని, పరిశోధకలు ఆనందయ్య మందును కరోనా మందు కాదని తేల్చినా ఇమ్యూనిటీ బూస్టర్లుగా పరిశిలిస్తామన్నారు. ఈ మేరకు ఆయుర్వేద ఫార్మసీలో ప్రణాళికలు సిద్ధం చేసుస్తున్నామని చెప్పారు.