ఒక్క డోస్ రూ.59,750!

Telugu Lo Computer
0


 కరోనా వైరస్ సోకిందా.? ఇంకపై ఏం భయపడాల్సిన పనిలేదు. కాక్ టెయిల్ ఇమ్యూనిటీ వచ్చేసింది. అయితే, ఖర్చు కాస్త ఎక్కువ. ఒకే ఒక్క డోస్ సరిపోతుంది. కానీ, దానికోసం ఏకంగా 59,750 రూపాయలు.  ఈ కాక్ టెయిల్ ఇమ్యూనిటీ (యాంటీ బాడీ ఇమ్యూనిటీ) డోసు పడిందంటే, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం కరోనా బాధితులకు వుండదన్నమాట. దీన్ని కేవలం ఇమ్యూనిటీ బూస్టర్ కోణంలోనే చూడాల్సి వస్తుందన్నది వైద్య నిపుణుల భావిస్తున్నారు. ఫేస్ మాస్కు ధరించాలి.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాల్సిందే!

ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో కరోనా బారినపడిన డొనాల్డ్ ట్రంప్‌కు ఈ మందునే వాడారు. ఈ కాక్ టెయిల్ ఔషధంలో రెండు మందులు కలిసి ఉంటాయి. ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల కలయికే  ఈ కాక్ టెయిల్ ఔషధం. భారత మార్కెట్లో 1200 ఎంజీ ఒక డోసు యాంటీబాడీ కాక్ టెయిల్‌ను రూ.59,750కి విక్రయించనున్నారు. ఒక్క ప్యాక్‌ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు చెబుతున్నారు. 

దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి.



Post a Comment

0Comments

Post a Comment (0)