జీ 5 సాంకేతిక ప్రయోగాల వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే వైరస్ వ్యాప్తికి జీ 5 సాంకేతికకు ఎటువంటి సంబంధంలేదని, ఇవి నిరాధార ఆరోపణలని, అశాస్త్రీయ ప్రచారాలని టెలికాం విభాగం (డాట్) స్పష్టం చేస్తుంది. జీ 5 సాంకేతికతను పలు దేశాలలోని ప్రజలు వినియోగించుకుంటున్నట్లు గమనించాలని మొబైల్ ఆపరేటర్ల సంఘం అంటుంది.
మొబైల్ టవర్ల నుంచి నాన్ - ఆయానైజింగ్ రేడియో తరంగాలు చాలా శక్తితో వెలువడుతాయి. ఆ తరంగాలు జీవించి వున్న కణాలపై లేదా మానవులపై ఎటువంటి ప్రభావాన్ని చూపవని డాట్ వివరించింది.
నాన్ - ఆయానైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్ (ఐసిఎన్ఐఆర్పీ), డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసిన పరిమితుల కంటే 10 రెట్ల భద్రతా నిబంధనల్లో ఉన్నామని డాట్ చెబుతుంది.