ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో యువ నావికురాలు ప్రీతి కొంగర స్టోరీని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రీతి అంతర్జాతీయ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. ముంబైలోని బాంబే హార్బర్లో జరిగిన తొలి ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో, సీనియర్ నేషనల్స్లో ప్రీతి స్వర్ణ పతకం సాధించడంతో అందరి మన్ననలు అందుకున్నారు. తెలంగాణలోని అల్పాదాయ వర్గం నుంచి ఎదిగివచ్చిన ప్రీతి సరైన గైడెన్స్, ట్రైనింగ్తో దేశం గర్వించదగిన క్రీడాకారిణిగా సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారని ఈ పోస్ట్లో ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు. ఆమె గురించి చదువుతూ తాను ఎంతో సంతోషించానన్నారు. ప్రీతికి సమయం ఉన్నప్పుడు ఆమెను కలిసి, సెయిలింగ్కు వెళతామని ఆమె తనకు నేర్పిస్తుందని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ షేర్ చేసిన పోస్ట్ను ఆనంద్ మహింద్ర రీషేర్ చేశారు. ఈ పోస్ట్కు నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్టయ్యారు. అల్పాదాయ వర్గం నుంచి అద్భుతంగా ప్రీతి ఎదిగిన తీరు అసాధారణమని పలువురు యూజర్లు ప్రశంసించారు.
ప్రీతి ఎదిగిన తీరు అద్భుతం !
January 29, 2023
0
Tags