కేటీఆర్మ కు మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. 20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ట్విట్టర్ లో కొనియాడారు. కేటీఆర్ తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారని, తనకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆశా జడేజా పేర్కొన్నారు. దావోస్‌లో మంత్రి కేటీఆర్ బృందం తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ దూసుకెళ్తుంది. మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన బృందం కలిసి తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతమైన జాబ్ చేస్తుందని ఈ సందర్భంగా ఆశా జడేజా కొనియాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)