బాలికపై అత్యాచారయత్నం

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని పాలి జిల్లా శివసాగర్ గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడు రోజు కూలీగా పనిచేస్తున్నాడు. తన పక్కింట్లో ఉండే స్నేహితుడి సోదరి అయిన 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. సోమవారం సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరూ లేనపుడు లోపలికి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో ఆమెను అదుపు చేసేందుకు ప్రకాష్ కత్తి తీసి బెదిరించాడు. అయినా ఆమె భయపడకపోవడంతో ఆమె మెడ, ఛాతీ, కాళ్లు, చేతులు, వీపు మీద మొత్తం 18 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)